Wednesday, 04 March 2026 01:23:36 PM
# మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి ..చంపేశారని క్రషర్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్న క్రషర్ యాజమాన్యం.?

Date : 25 December 2023 10:46 AM Views : 719

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మిడ్జిల్ : ఓ మెటల్ స్టోన్ క్రషర్లో టిప్పర్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో రైల్వేట్రాక్పై శవమై కనిపిం చిన సంఘటన ఇది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండ లంలో ఆదివారం జరిగింది. పోలీసులు, మృతుని తల్లిదం డ్రులు తెలిపిన వివరాలా ఉన్నాయి.. మిడ్జిల్ మండలం భైరంపల్లి గ్రామానికి చెందిన మహేష్ (24) అనుమానాస్ప దంగా మృతిచెందాడు. మహేష్ ఇదే మండలం చేద్గట్టు తండా శివారులోని ఏఎస్ఆర్ మెటల్ స్టోన్ క్రషర్లో కొంత కాలంగా టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతని స్వగ్రా మానికి ఆ క్రషర్ కంపెనీ ఐదు కిలో మీటర్ల దూరం కావ డంతో రోజూ పనులకు వెళ్లి, స్వగ్రామానికి వచ్చేవాడు. అతను శనివారం టిప్పర్ నడిపేందుకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, ఆదివారం రాజాపూర్ శివారులోని రైల్వే ట్రాక్పై శవమైకనిపించినట్లు తెలిపారు. మెటల్ క్రషర్ యాజమాన్యా నికి ఫోన్ల్చేసినా స్పందించడంలేదని పలువురు గ్రామస్థులు తెలిపారు. మెటల్ క్రషర్ యాజమాన్యం వేధింపుల వల్లనే తమ కుమారుడు చనిపోయాడంటూ మృతుడి తండ్రి నర్సింహ, తల్లి సువర్ణలు తమ బంధువులతో కలిసి మెటల్ క్రషర్ వద్ద మృత దేహాన్ని తీసుకువెళ్లి అక్కడ ఓ రూంలో ఉంచి అక్కడి నుంచి వెనుదిరిగారు. గతంలో కూడా మెటల్ క్రషర్ వద్ద ఎక్స్కైవేటర్పై రాళ్లుపడి వ్యక్తి మృతిచెందితే సంబంధిత అధికారులు మొక్కుబడిగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కార్మికులను వేధింపులకు గురిచేస్తూ, బ్లాస్టింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెటల్ క్రషర్ యాజమాన్యంపై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేరించినట్లు తెలిపారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :