కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మిడ్జిల్ : ఓ మెటల్ స్టోన్ క్రషర్లో టిప్పర్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో రైల్వేట్రాక్పై శవమై కనిపిం చిన సంఘటన ఇది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండ లంలో ఆదివారం జరిగింది. పోలీసులు, మృతుని తల్లిదం డ్రులు తెలిపిన వివరాలా ఉన్నాయి.. మిడ్జిల్ మండలం భైరంపల్లి గ్రామానికి చెందిన మహేష్ (24) అనుమానాస్ప దంగా మృతిచెందాడు. మహేష్ ఇదే మండలం చేద్గట్టు తండా శివారులోని ఏఎస్ఆర్ మెటల్ స్టోన్ క్రషర్లో కొంత కాలంగా టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతని స్వగ్రా మానికి ఆ క్రషర్ కంపెనీ ఐదు కిలో మీటర్ల దూరం కావ డంతో రోజూ పనులకు వెళ్లి, స్వగ్రామానికి వచ్చేవాడు. అతను శనివారం టిప్పర్ నడిపేందుకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, ఆదివారం రాజాపూర్ శివారులోని రైల్వే ట్రాక్పై శవమైకనిపించినట్లు తెలిపారు. మెటల్ క్రషర్ యాజమాన్యా నికి ఫోన్ల్చేసినా స్పందించడంలేదని పలువురు గ్రామస్థులు తెలిపారు. మెటల్ క్రషర్ యాజమాన్యం వేధింపుల వల్లనే తమ కుమారుడు చనిపోయాడంటూ మృతుడి తండ్రి నర్సింహ, తల్లి సువర్ణలు తమ బంధువులతో కలిసి మెటల్ క్రషర్ వద్ద మృత దేహాన్ని తీసుకువెళ్లి అక్కడ ఓ రూంలో ఉంచి అక్కడి నుంచి వెనుదిరిగారు. గతంలో కూడా మెటల్ క్రషర్ వద్ద ఎక్స్కైవేటర్పై రాళ్లుపడి వ్యక్తి మృతిచెందితే సంబంధిత అధికారులు మొక్కుబడిగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కార్మికులను వేధింపులకు గురిచేస్తూ, బ్లాస్టింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెటల్ క్రషర్ యాజమాన్యంపై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేరించినట్లు తెలిపారు.
Admin
Kalam Power News