కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : గెలిచినా ఓడిన 27 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. నా కొడుకు మిథున్ రెడ్డి కూడా ప్రజల్లోనే ఉంటాడు అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఆముదాలపాడు జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 30 న జరిగినా ఎన్నికల్లో నా కొడుకును పాలమూరుకు పరిచయం చేసిన సందర్భంగా ఆదరించి 20వేల ఓట్లు వేసిన ఓటర్లకి బిజెపికి ఓటు వేయించేందుకు కృషిచేసిన కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో అందరూ గెలవాలని ప్రయత్నం చేస్తారు కానీ గెలిచేది ఒక్కరే అని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారన్నారు. తెలంగాణను పాలిస్తున్న టిఆర్ఎస్ మాకొద్దు, కెసిఆర్ ఇక నీకు సెలవు దొర మీ పాలన అంటూ ప్రజల నిర్ణయం తీసుకున్నారాన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒకవేళ ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడేది అని ప్రజల స్పష్టం చేశారు. అనివార్య కారణాలవల్ల బండి సంజయ్ ని తప్పించిన తర్వాత తెలంగాణలో క్రమక్రమంగా కాంగ్రెస్ చేతులకి వెళ్లిపోయిందన్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నానని వారు మంచి పాలన కొనసాగించాలని కోరుకుంటున్నానన్నారు. కబ్జాలు ఇసుక దందాలు దౌర్జన్యాలు లేకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు,జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవర్ధన్ రెడ్డి,పి సత్యం, జిల్లా కోశాధికారి ఎస్ పాండురంగారెడ్డి, జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సురేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య ,కౌన్సిలర్ రామాంజనేయులు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేణమ్మ, ఉపాధ్యక్షురాలు యాదమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు జామ్ శ్రీనివాసులు, కే.సతీష్ కుమార్, మఠం మయూరి నాథ్, వెంకటయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News