కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రంలో 9 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్, ద్వార బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారని రాష్ట్ర రవాణా మరియు బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా లోని నవాబుపేట మండలం కొల్లూరు గ్రామం లో చింతలపూరి చిన్మయ స్వామి మఠం ఆలయ ముఖద్వారాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రికి మఠం, ఆలయ వేదపండితులు మంత్రోచారణలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. తరువాత శ్రీశైల పీఠాధిపతులు జగద్గురువులు, చిన్న సిద్ద రామ ఆద్వర్యంలో ఆలయంలో బ్రాహ్మణుల చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ధర్మ జాగృతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎంత శ్రమ పడినప్పటికి బగవంతుని సంకల్పం వుండాలన్నారు. ప్రజా పాలనలో తెలంగాణ ప్రజలు, స్వేచ్ఛగా వుండాలన్నారు. బగవంతుని సంకల్పంతో ప్రజల సమస్యలను,అన్ని కార్యక్రమలను, విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. సంతోషం, భాధలు, వస్తుంటాయి, పోతుంటాయన్నారు. కొల్లూరు గ్రామములో జీవ సమాధి అయిన పుణ్యభూమి నుండి బగవంతుడు శక్తిని, ముక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల, దేవరకద్ర, షాదనగర్, నాగర్ కర్నూల్ ఎం ఎల్ ఏ లు అనిరుధ్ రెడ్డి, గవినొల్ల మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహనరావు, బీసీ సంక్షేమ అధికారిని ఇందిర, నవాబ్ పేట తహసీల్దార్ మల్లికార్జున రావు, ఎం పి డి ఓ శ్రీ లత, ఇతర అధికారులు, , వేదపండితులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News