కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / Kurnool : కలంపవర్ న్యూస్, శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణం లోని పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు. అనంతరం వీరశిరోమండపం వద్ద కొలువైన శనగల బసవన్న నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించి.. పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాన్ని సమర్పించి, నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు….
Reporter
Kalam Power News