కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి మాత జయంతి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి జయంతిగా జరుపుకుంటారు. జయంతి మాసం సందర్భంగా వేకువజామున వాసవి మాత అభిషేకం అనంతరం గీతా పారాయణం హనుమాన్ చాలీసా పటణం అమ్మవారి పల్లకి సేవను నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. పల్లకి సేవ అనంతరం సామూహిక కుంకుమార్చన వాసవి మాత పారాయణ పఠనం జరిగింది. అనంతరం వాసవి మాత డోలాహరణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు ఉత్సవాలకు హాజరయ్యారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ రమేష్ బాబు భోజన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుల్లపల్లి శ్రీధర్, కోశాధికారి శివా జగదీశ్వర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంప శ్రీనివాస్ వాసవి క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి అశోక్ ఆవోపా అధ్యక్షుడు సతీష్ గుప్తా తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్యవైశ్యులు భక్తులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News